Home  »  TV News  »  Karthika Deepam2 : దీపకి అపోజిట్ గా బలమైన సాక్ష్యాలు.. కార్తిక్ తనని తప్పించగలడా!

Updated : Aug 8, 2024

 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -117 లో....దీప తన భర్తని వదిలేసి వివాహాతేర సంబంధం పెట్టుకొని తన కూతురిని సరిగ్గా చూసుకోవట్లేదని సాక్ష్యాలున్నాయ్ కాబట్టి నా క్లయింట్ కి న్యాయం చెయ్యాలని కోరుతున్నానని VV జడ్జ్ ని కోరతాడు. నా క్లయింట్ మానసిక స్థితి ఇప్పుడు బాలేదు.. తనని తను నిరూపించకునే సిచువేషన్ లో లేదు దయచేసి వాయిదా వెయ్యాలని కోరుతున్నానని లాయర్ జ్యోతి జడ్జ్ ని రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో జడ్జ్ వాయిదా వేస్తాడు.

మరొకవైపు ఏం చేసిన శౌర్యని నరసింహా దగ్గరికి వెళ్లకుండా ఎవరు ఆపరు.. బావ కూడ ఆపలేడని పారిజాతంతో జ్యోత్స్న అంటుంది. ఇలా వాయిదాలు తీసుకోవడం అలవాటని తెలుసు.. మీరేం చేసినా నిజమే గెలుస్తుందని  జ్యోతితో VV అనగానే.. అదే అంటున్నా న్యాయం గెలుస్తుందని జ్యోతి అంటుంది. దీప బయటకు వచ్చి బాధపడుతుంటే జ్యోతి, కార్తీక్ వస్తారు. ఇవన్నీ నాకు ముందే ఎందుకు చెప్పలేదని జ్యోతి అనగానే.. అవన్నీ అబద్ధాలు మేడమ్ తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాడని కార్తీక్ అంటాడు. దీప పరిస్థితి ఇప్పుడు బాలేదు. తర్వాత మాట్లాడుదామని జ్యోతి అంటుంది. ఆ తర్వాత దీప ఒక దగ్గర కూర్చొని బాధపడుతుంటే నరసింహా, అనసూయ, శోభ వస్తారు. నరసింహా ఇంకా తన మాటలతో దీపని బాధపెడతాడు. ఆ తర్వాత నరసింహా వాళ్ళు వెళ్ళిపోయాక కార్తీక్ వచ్చి.. ఇంటికి వెళదామని అంటాడు. నన్ను కాసేపు వదిలేయండని దీప అంటుంది‌. సరే కానీ శౌర్యని మీ నుండి ఎవరు దూరం చెయ్యలేరు గుర్తు పెట్టుకోండి అని కార్తీక్ అంటాడు.

మరొకవైపు శౌర్య ఆడుకుంటుంటే.. జ్యోత్స్న, పారిజాతం వస్తారు. హాయ్ జో అని శౌర్య అనగానే హ్యాపీగా ఆడుకుంటున్నావ్.. ఆడుకో ఇవ్వాల ఒక్కరోజే.. రేపు మీ నాన్న వచ్చి తీసుకొని వెళ్తాడని జ్యోత్స్న అని వెళ్ళిపోతుంది. నన్ను బూచోడు తీసుకొని వెళ్తాడా అని శౌర్య భయడుతుంటే.. లేదని జ్యోత్స్న దగ్గరికి సుమిత్ర వెళ్లి.. ఎందుకు అలా అన్నావని అడుగుతుంది. కోర్ట్ లో జరిగింది పారిజాతం చెప్పి.. దీప గురించి తప్పుగా మాట్లాడుతుంది. దాంతో పారిజాతంపై సుమిత్ర కోప్పడుతుంది. మరొకవైపు కార్తీక్ తో శ్రీధర్ కోపంగా మాట్లాడతాడు. మీరు పరువు గురించి మాట్లాడకండి నాన్న అంటూ శ్రీధర్ పై కార్తీక్ కోప్పడతాడు. ఆ తర్వాత దీప నడుచుకుంటూ వెళ్తుంటే.. చెప్పు తెగిపోతుంది. అప్పుడే నరసింహా వాళ్ళు దీపతో మాట్లాడాలని కార్ దిగుతాడు. దీప దగ్గరికి వెళ్తుంటే.. దీప తెగిపోయిన చెప్పు విసిరేస్తే, అది నరసింహాపై పడుతుంది. దీన్ని వదిలిపెట్టకూడదని నరసింహా అంటే.. కోర్టులో చూసుకుందామని అనసూయ తీసుకొని వెళ్తుంది. దీప వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.